Tuesday, December 22, 2009

ఎనిమిది గంటలపని

అమెరికాకు చెందిన సుప్రసిద్ధ స్త్రీవాది, సంఘ సంస్కర్త ఆడమ్స్ జేన్. 1860లో జననం, 1935లో మరణం. తన దేశపు మహిళలకోసమేగాక అమెరికాకు వలసవచ్చిన నల్లజాతి స్త్రీలు, చిన్నారుల కోసం తన జీవితాన్ని అంకితం చేసింది. పీస్ అండ్ బ్రెడ్ ఇన్ టైమ్ ఆఫ్ వార్, డెమొక్రసీ అండ్ సోషల్ ఎథిక్స్ వంటి అద్భుత రచనలు చేసిన ఈమె కృషి ఫలితంగానే స్త్రీలకు ఎనిమిది గంటల పని వ్యవస్థ అమలులోకి వచ్చింది. 1931లో ప్రొఫెసర్ నికాలస్ ముర్రే బట్లర్‌తో కలసి నొబెల్ బహుమతినందుకున్న ఆడమ్స్ జేన్ 1910లో 'నేషనల్ కాన్ఫరెన్స్ ఫర్ సోషల్ వర్క్' తొలి అధ్యక్షరాలిగా పనిచేశారు. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ సెటిల్‌మెంట్స్ స్థాపనకు చేయూతనిచ్చిన జేన్, నేషనల్ అమెరికన్ ఉమెన్ సఫరేజ్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలిగా సేవలందించారు. శాంతి, స్వేచ్ఛ కోసం ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా సంస్థకు కొంతకాలం నేతృత్వం వహించారు.

No comments:

Post a Comment